Wednesday, August 10, 2011

"ఓ ఆత్మ.."



అతి తక్కువ సమయం లో నాకు ఆత్మీయునిగా మారి, మనందరి మధ్య నుండి తిరిగిరాని తీరాలకు వెడలిపోయిన నా మిత్రుడు సాయి మరణానికి ఇదే నా అశ్రునివాళి.............


"ఓ ఆత్మ నేడు,
 తనకు ఇన్ని రోజులూ ఆశ్రయమిచ్చిన శరీరాన్ని వదలి,
 ఈ విశ్వ రహస్యంలో అంతర్ధానమైపోయింది!
 సృష్టి మూలాలను చేధించేందుకు,
 తన ఆశను,తన నీడను ,
 తన అర్ధాంగిని,తన రక్తాన్ని,
 అనుంగులను,అన్నదమ్ములను,
 అందరి చిరునవ్వులను చెమర్చుకుంటూ...
 తనగుండె చప్పుళ్ళను ఆపి,శరీరన్ని వదలి,
 సత్యాన్వేషి అయి ఒంటరిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
 తెలవారాక ఆ పలకరింపులు లేవు! 
 మలుపు మాటున సడిచేసిన ఎరిగిన గొంతుక లేదు!
 చిరునవ్వులు చిద్రమవుతూ,కనుల ముందే బూడిదవుతూ,
 కన్నీటి వీడ్కోలులు అందుకొని,
 తిరిగి రాని లోకాలకు ఇంత త్వరగా వెళుతున్నావా?
 ఇన్నాళ్ళ నీ బాధను చెప్పుకునేందుకు,
 నీ తల్లిదండ్రుల చెంతకు చేరుకున్నావా? 
 సమాధానం చెప్పు మిత్రమా!!!!!!!!!!!!!!
 ఆలశ్యమవ్వవచ్చుగాక @@@@@@
 ఖచ్చితంగా నేనూ నినుచేరి... నీ చిరునవ్వులు చూస్తాను.
 ఆ క్షణాన తిరిగి మనం మనసు విప్పి మాట్లాడుకుంద్దాం!!!"  

1 comments:

Anonymous said...

Vijay Kumar: mee hituduni, sannihitudni kolpoyi mee aarti to raasinakavita endaro mee lanti snehitulaku spoorthi....

Post a Comment